GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జూన్ -1(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలానికి నూతన ఎస్ఐగా జి. జ్యోతి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన సి హెచ్ గణేష్ ను సిరిసిల్ల టౌన్కు బదిలీ చేయగా డిసి ఆర్ బి సిరిసిల్ల లో పనిచేస్తున్నజ్యోతి ఎస్ఐగా బదిలీపై వచ్చారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మండలం లో శాంతి భద్రత ల పరిరక్షణ కు కృషి చేస్తామని, అసాంఘిక కార్యకలాపాల పై ప్రత్యేక నిఘా ఉంచుతానని తెలిపారు. ఈ సందర్బంగా ఆమెకు పలువురు నాయకులు, పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియచేశారు మండలంలోని శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, ప్రజలు ఎక్కడైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు
.
Aksharam Telugu Daily