D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ జూలై 9 (అక్షరం న్యూస్) ఈ నెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం, నామవరం క్రాస్ రోడ్, జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభ కు వచ్చే రైతులు, ప్రజలు, అధికారులు, మీడియా, తదితర వాహనాలు మినహా ఖమ్మం నుండి బోనకల్ కు సాధారణ వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరుగుతుందని వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు ఆంక్షలు అమలులో వుంటాయని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని సూచించారు. ఖమ్మం నుంచి వయా పందిళ్లపల్లి, చింతకాని, బోనకల్, ఆంధ్రకు వెళ్లే వాహనాలు నేలకొండపల్లి మీదుగా వెళ్లాలని, అదేవిధంగా బోనకల్లు నుంచి ఖమ్మం వైపు వచ్చే వాహనాలు వైరా మీదుగా రావాలన్నారు. ధాంసలాపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు దగ్గర నుంచి బోనకల్ బ్రిడ్జి వరకు సాధారణ వాహనాలు అనుమతించబడదు. Note: హైదరాబాదు నుంచి మీటింగ్ కి వచ్చే విఐపి వాహనాలు కోదాడ, నేలకొండపల్లి, ముదిగొండ లోని వల్లపురం నుంచి మీటింగ్ స్థలం కి త్వరగా చేరుకోవచ్చు ని తెలిపారు.
.
Aksharam Telugu Daily