AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 12/అక్షరం న్యూస్/---శ్రావణమాసం శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని త్రికూట దేవాలయం నందు కొలువై ఉన్న శ్రీ వాసవి మాత కు ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వివిధ పండ్ల రకాలు కలిగిన 108 బిందెలతో అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారికి 108 కేజీల పసుపు 108 కేజీల కుంకుమతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులైయ్యారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన త్రికూట ఆలయ కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.
.
Aksharam Telugu Daily