DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఆగస్టు 30 అక్షరం న్యూస్; పెద్దపల్లి మండలం హనుమంతుని పేట గ్రామంలో స్వశక్తి సంఘాల రుణాల గోల్మాల్ పై సంబంధిత కమ్యూనిటీ కోఆర్డినేటర్ సిసి సతీష్ పర్యవేక్షణ లోపంపై ఆయనకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కాళిందినీ మెమో జారీ చేశారు. "స్వశక్తి సంఘాల పేరుతో రుణాలు"ఓ వివో ఏ నిర్వాకం"పేరుతో గత జులై నెల 26వ తేదీన అక్షరం దినపత్రికలో సమగ్ర వార్తా కథనం వెలువడింది. ఈ వార్తకు స్పందించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారిని కాళిందినీ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం గ్రామంలో ఉన్న వివోఏ కలీం పరిధిలో గల స్వశక్తి సంఘాల బ్యాంకు రుణాలు, లావాదేవీలపై ఆడిట్ అధికారులతో ఆడిట్ నిర్వహించారు. సుమారు 46 లక్షలు వరకు స్వశక్తి సంఘాలకు సంబంధించిన డబ్బులు వివో ఏ కలీం తీసుకున్నట్టు సభ్యులు అధికారులకు తెలియజేశారు. అయితే ఒక నలుగురు ఐదుగురు తప్ప మిగతా వారికి అందుకు సంబంధించిన ఆధారాలు ఏమి లభించలేదని అధికారులు తెలిపారు. ఈ విషయంలో సంబంధిత కమ్యూనిటీ కోఆర్డినేటర్ సతీష్ పర్యవేక్షణ లోపం స్పష్టంగా ఉందని అధికారులు గుర్తించారు. విచారణ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు సీసీ సతీష్ కు మేమో జారీ చేసినట్టు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి తెలిపారు. ఎవరైతే రుణాలు తీసుకున్నారు వారు విధిగా వాయిదాలను చెల్లించాలని లేనిపక్షంలో శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డిఆర్డిఓ హెచ్చరించారు.
.
Aksharam Telugu Daily