GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్/సిద్దిపేట మార్చి 26(అక్షరం న్యూస్ ) హుస్నాబాద్ నియోజకవర్గం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన లో కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హయాంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని,ఎన్నికల సమయంలో హుస్నాబాద్ ప్రాంతానికి ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలకు నిధులు మంజూరు చేస్తున్నారని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు...హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కళాశాల మంజూరి పట్ల ఆయన స్పందిస్తూ పెద్దపల్లి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు శాతవాహన యూనివర్సిటీ కి హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజి మంజూరు చేసిన ప్రభుత్వం కు హుస్నాబాద్ ప్రాంతానికి రావడం కోసం కృషి చేసిన రాష్ట్ర రవాణా&బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సీపీఐ పార్టీ పక్షాన ప్రత్యేక విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంద పవన్ అన్నారు.రానున్న రోజుల్లో హుస్నాబాద్ ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నామని,యువత గతంలో నిరుద్యోగ మేళా నిర్వహించిన మంత్రి శాశ్వత పరిష్కారం కోసం పారిశ్రామిక కారిడార్ లను తీసుకొచ్చి హుస్నాబాద్ లో నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.
.
Aksharam Telugu Daily