GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జులై-23(అక్షరం న్యూస్) ముస్తాబాద్ మండలం లోని వివిధ గ్రామాల్లో బుధవారం భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన వర్షం జోరుగా పడుతూనే ఉంది. వర్షం కోసం అన్ని వర్గాలు ఎదురుచూస్తున్న సమయంలో ఎట్టకేలకు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుండటం తో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరుతుంది. కొద్ది రోజుల నుంచి వర్షాలు లేకపోగా.. వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో వరి నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో వర్షం పడడంతో ఊటర చెందారు. వరి ఆకుమడులకు ఈ వర్షం ఊపిరి పోసిందని అంటున్నారు. అదే విధంగా ఇప్పటికే నాటిన సరుగుడు మొక్కలకు ఈ వర్షం ఎంతో దోహదపడుతుందని చెబుతున్నారువర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేక భూముల్లో నాటిన పత్తి, కంది, సోయాబీన్, మినుము,పెసర మొక్కలు ఎండిపోయేదశకు చేరుకోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయా గ్రామ లలో కురుస్తున్న వర్షం పంటలకు మళ్లీ జీవం పోస్తుంది
.
Aksharam Telugu Daily