Monday, 19 May 2025 11:24:50 PM

ఖమ్మం - మహబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి: వద్దిరాజు* - రామయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ వద్దిరాజు

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 15 April 2025 03:14 PM Views : 319

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్/ఏప్రిల్ 15 (అక్షరంన్యూస్) తన జీవితం మొత్తం మొక్కలు నాటాడానికే అంకితం చేసిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య ధరిత్రి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇటీవలే మృతి చెందిన వనజీవి రామయ్య కు మంగళవారం రవిచంద్ర నివాళులు అర్పించారు. రెడ్డిపల్లి లోని ఆయన నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం - మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య మార్గ్ పేరుతో నామకరణం చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు. ఖమ్మం నుంచి రెడ్డిపల్లి వరకు 8 కిమీ మేర వనజీవి రామయ్య మొక్కలు నాటారని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లన్నీ కూల్చేసినందున, మళ్ళీ అదే వరసలో మొక్కలు నాటి.. సంరక్షించి రామయ్య కు నివాళులు అర్పించాలని కోరారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రామయ్య చరిత్ర భావి తరాలకు తెలిసేలా కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్ర ను ప్రవేశ పెట్టాలని ఎంపీ రవిచంద్ర కోరారు. జిల్లాలో కూడా ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :