GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, మార్చి 26 అక్షరం న్యూస్: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని కాల్వ శ్రీరాంపూర్ మండల మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు బుధవారం రోజున పవిత్ర రంజాన్ పురస్కరించుకొని మండల కేంద్రంలోని మజీద్ ఆవరణలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో మైనార్టీల అభివృద్ధికీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిందని కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇఫ్తార్ విందులు విందులు సోదర భావాన్ని పెంచుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజనవేణ సదయ్య, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, మాజీ సర్పంచ్ మాదాస్ సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎనగంటి రవి, రామచందర్ ,యువజన సంఘం మండల అధ్యక్షులు శివరామకృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గీస రాజు, ముస్లిం మైనార్టీ మండల అధ్యక్షులు ఎండి రహీం ఖాన్ , రాణవేన క్రాంతి,మోటం రాజశేఖర్,గోరెమియ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జిన్న రామచంద్రారెడ్డి,ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో ముస్లిం యువత తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily