GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/డిసెంబర్-02(అక్షరం న్యూస్) సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళల భద్రత కోసమే షీ టీంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని షీ టీం సభ్యులు తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచనల మేరకు జిల్లా షీ టీమ్ ప్రతిరోజూ విద్యాసంస్థలు,మహిళలు పని చేసే ప్రదేశాలను సందర్శిస్తూ గుడ్ టచ్ / బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టం, షీ టీమ్ సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలభాగంగా ముస్తాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ని ప్రభుత్వ పాఠశాల లను షీ టీం బృందం సందర్శించారు. విద్యార్థుల కు అవగాహనా కల్పించారు. విద్యార్థులను ఎవరైనా లైంగిక వేధింపులకు గురైతే వెంటనే షీ టీం నెంబర్ 8712656425 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. లోన్ యాప్లు, మొబైల్ ఫోన్లలో వచ్చే ఫేక్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని అన్నారు గత నెలలో జిల్లాలో వేధింపులకు పాల్పడిన వారిపై రెండు ఎఫ్ ఐర్ కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. సోషల్ మీడియా లో అపరచిత వ్యక్తులకు స్పందించకూడదని గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తి గత సమాచారం పంచుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ ప్రమీల, వీరయ్య, సిబ్బంది శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily