DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి, డిసెంబర్ 13 – అక్షరం న్యూస్: ప్రజల గొంతుకగా నిలుస్తూ, నిత్యం ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రతిబింబిస్తున్న అక్షరం దినపత్రిక పాత్ర అభినందనీయమని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. ప్రజాపక్షం వహిస్తూ వాస్తవాలను వెలికి తీసే అక్షరం వార్తా కథనాలు ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నాయని ప్రశంసించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో అక్షరం దినపత్రిక రూపొందించిన 2026 ఆంగ్ల క్యాలెండర్ను డిపిఓ వీరబుచ్చయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధికి దోహదపడేలా, పాలన–ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్న అక్షరం దినపత్రిక మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అక్షరం దినపత్రిక పెద్దపల్లి ప్రతినిధి దొమ్మటి రాజేష్, పాత్రికేయులు పని సుదర్శన్, సోమకుమార్, నూనె శ్రీనివాస్ తదితరులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు.
.
Aksharam Telugu Daily