Monday, 20 April 2026 05:39:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటా

పత్రికల్లో తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు* *పత్రికల్లో మీడియాలో తప్పుడు ఆరోపణలు ప్రచురించిన పత్రిక రిపోర్టర్లకు లీగల్ నోటీసులు* *జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు*


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 25 December 2025 02:18 PM Views : 440

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : * * కరీంనగర్/జమ్మికుంట/డిసెంబర్ 25/అక్షరం న్యూస్: రాజకీయ పార్టీ నాయకులు కొంతమంది విలేకరులు నాపై కావాలని రాజకీయంగా నన్ను ఇబ్బందులు గురిచేయాలనే ఉద్దేశంతో నాపై, మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం శివారులో గల అంజన టౌన్ షిప్ పైన తప్పుడు ఆరోపణలు రాతలు రాస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఏదైనా చట్టల ద్వారా వారికి సమాధానం చెప్తానని జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. గురువారం రోజున తన నివాసంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి రాజేశ్వరావు మాట్లాడుతూ రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ము లేక కొంతమంది ఒక పత్రిక ఒక మీడియా ఛానల్ విలేకరులను ఆసరా తీసుకొని నాపై తప్పుడు రాతలు రాపిస్తున్నారని అన్నారు. అంజన టౌన్ షిప్ పైన తప్పుడు వీడియోలు తప్పుడు రాతలు విలేకరులకు లీగల్ నోటీసులు, జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాల నుండి అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు గురిచేస్తూ అంజన టౌన్షిప్ పై ఎంతోమంది ఫిర్యాదులు చేశారని ప్రభుత్వాధికారులు వచ్చి ఎలాంటి ప్రభుత్వ భూమి అంజన్న టౌన్ షిప్ లో లేదని నిర్ధారించిన కానీ కొంతమంది అందులో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న ప్రజలను నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం అంజన టౌన్ షిప్ లేఔట్ ప్రారంభించినప్పుడు అన్ని రకాలుగా ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్న తర్వాతనే అందులో క్రయవిక్రయాలను ప్రారంభించామని అప్పటినుండి ప్రభుత్వం ఏ విధంగా అయితే లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడానికి ఎలాంటి అర్హతలు ఉండాలో అన్ని పత్రాలు సంబంధిత అధికారులకు సమర్పించిన తర్వాతనే ప్రారంభించామని రాజేశ్వర్ రావు తెలిపారు. ఒక మీడియా ఛానల్ ఒక పత్రిక రిపోర్టర్ ను అడ్వపెట్టుకొని నా పైన తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని రాజేశ్వరరావు హెచ్చరించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :