GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జులై-25(అక్షరం న్యూస్) ముస్తాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయాలు జరిపే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సూర అజయ్, సూర ప్రదీప్ అనే ఇద్దరు గంజాయి కీ అలవాటు పడి ఎక్కువ ధర ల కు అమ్ముతు వాటితో జల్సాలు చేస్తుండే వారని .గూడెం గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ముస్తాబాద్ ఎస్.ఐ గణేష్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద 109గ్రాముల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని సి.ఐ మొగిలి తెలిపారు. అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.యువత డ్రగ్స్ భారినపడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు ,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు.జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.
.
Aksharam Telugu Daily