AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు/సెప్టెంబర్06/అక్షరం న్యూస్: సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎల్లంకి మధు అమ్మగారు సీపీఐ సీనియర్ నాయకురాలు ఎల్లంకి కమలమ్మ ఆదివారం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కమలమ్మ పార్థవ దేహానికి పూలమాల వేసే ఘన నివాళులర్పించి అనంతరం వారు మాట్లాడుతూ వారి కుటుంబం పార్టీకి, పేద ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ముందుకు నడిపించిన చరిత్ర వారి కుటుంబానికి ఉందని పార్టీలో తారతమ్యం లేకుండా అందరితో మంచిగా ఉండేవారని ఎల్లప్పుడూ ప్రజల పక్షాన అండగా ఉండేవారని పార్టీలకు అతీతంగా అందరితో కలిసి ఉంటే వారని ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారి మరణం ఈ ప్రాంత వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటని వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా , కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం-భద్రాద్రి జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, చండ్ర నరేంద్ర కుమార్, సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, కుమారి,హనుమంతరావు,ఎస్ కే నాగుల్ మీరా. వలమల సామేలు, పోనేకంటి వెంకటేశ్వర్లు, తూము కోటయ్య, వెంకటప్పయ్య, చెరుకుమల రాజేశ్వరరావు, తాత నరసింహారావు తదితర పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నివాళులర్పించారు.
.
Aksharam Telugu Daily