GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/కరీంనగర్/ఏప్రిల్ 2/ అక్షరం న్యూస్: సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరము కోసం.గురువారం శంకరపట్నం మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు.గ్రామ సభల ఆరంభంలో రాష్ట్ర గీతం ఆలపించి సభలను ప్రారంభించి సీఎం సందేశాన్ని చదివి వినిపించారు.అనంతరం అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,ఉచిత ఆర్టీసీ ప్రయాణం,రూ.500కే గ్యాస్ సిలిండర్,గృహజ్యోతి,పెంచిన పింఛన్ల పథకాలపై గ్రామస్తులకు సమగ్రంగా అవగాహన కల్పించారు.గ్రామాల్లో సమస్యలు ఉంటే సభలో తమ దృష్టికి తీసుకురావాలని,లబ్ధిదారులకు పింఛన్లు,ఇతరత్రా సమస్యలుంటే దరఖాస్తు చేసుకుంటే 99 రోజుల ప్రణాళికలో భాగంగా వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు సక్రమంగా అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని,గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ప్రత్యేక అధికారులు, సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డుమెంబర్లు,కార్యదర్శులు,గ్రామస్తులు,వివిధ శాఖ ల అధికారులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily