D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం : * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జూన్ 11/ వైరా (అక్షరంన్యూస్)* వైరా మండలంలో రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతోంది. మండలంలోని పలు గ్రామాలు వైరా,పినపాక, గరికపాడు,నారుపునేనిపల్లి, రెబ్బవరం,తాటిపూడి, సోమవారం తదితర గ్రామాల నుండి రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు.ఈ పీడీఎస్ బియ్యాన్ని అక్రమ దారులు గుర్తుచప్పుడు కాకుండా రహస్య స్థావరాలకు తరలిస్తూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. *కొత్తదారి ఎంచుకున్న అక్రమార్కులు....!* సన్న బియ్యాన్ని డీలర్ల వద్ద నుంచే అక్రమార్కులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అక్రమార్కులు బియ్యం తరలింపులో నయా విధానం అవలంభిస్తున్నారు.గతంలో ఆటోలు, టాటా ఏసీ వాహనాలలో రేషన్ బియ్యాన్ని ఒకేసారి తరలించేవారు.ఈ క్రమంలో పెద్ద మొత్తంలో బియ్యం పట్టుబడితే పట్టుబడిన మొత్తం బియ్యం బస్తాల్ని సీజ్ చేసేవారు.ఇలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన అక్రమార్కులు రవాణాకు ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు.ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహనాలపై రెండు, మూడు బస్తాలు తరలిస్తున్నారు. మార్గమధ్యలో ఎవరైనా అడిగితే ఇవి మా సొంత బియ్యం అని బుకాయిస్తున్నారు.తక్కువ కిలోల చొప్పున బస్తాల్లో తరలిస్తూ కొద్దికొద్దిగా రేషన్ బియ్యాన్ని రహస్య స్థావరాలకు చేరవేస్తున్నారు *పగలు లేదు రాత్రి లేదు...!* పగలు పూట సేకరించిన బియ్యాన్ని అక్రమంగా రాసేస్తావరాల్లో నిల్వ ఉంచి. వేకువ జామున 3 గంటల నుండి వారు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిస్తున్నారు.రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాల్సిన అధికారులు నామమాత్రంగా అయినా తనిఖీలు కూడా చేయటం లేదు.దీంతో అక్రమార్కుల దందా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily