MD FAHEEM, REPORTER, BHADRADRI KOTHAGUDEM Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ సుజాతనగర్/ అక్టోబర్ 08/ అక్షరం న్యూస్; కొత్తగూడెం నుండి ఖమ్మం ప్రధాన రహదారి వెంబడి కొమ్ముగూడెం ప్రాంతంలో జూలూరుపాడు మాజీ ఎంపీపీ లాలూ నాయక్ ఏర్పాటు చేసిన బికేఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు నాగాసీతారాములు పాల్గొన్నారు .ఈ సందర్భంగా నాగాసీతారాములు మాట్లాడుతూ వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్ ,డీజిల్ అందజేసి వాహనదారుల మన్ననలు పొందుతూ అనతి కాలంలోనే వ్యాపార పురోభివృద్ధి సాధించాలని అయన ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి , కొత్తగూడెం సొసైటీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు ,అర్జునరావు, రాజశేఖర్, మంగీలాల్ ,మధు, సతీష్, కిషన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .
.
Aksharam Telugu Daily