Friday, 14 November 2025 01:17:40 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జాతీయ రహదారుల నిర్మాణ పనుల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి.... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 September 2025 08:29 PM Views : 340

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 14 (అక్షరంన్యూస్) జిల్లాలో పురోగతిలో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, భూ సేకరణ సమస్యలపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తవడానికి మిగులు భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో జాతీయ రహదారుల నిర్మాణ పురోగతి పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఖమ్మం-దేవరపల్లి, నాగపూర్-అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం-దేవరపల్లి రహదారికి ధాంసలాపురం వద్ద ఎంట్రీ, ఎక్జిట్ పాయింట్ కొరకు 6.22 ఎకరాల భూసేకరణ చేయాలన్నారు. ఇందులో 3.16 ఎకరాలకు ఇప్పటికే అవార్డ్ పాస్ చేసినట్లు, మిగతా 3.06 ఎకరాలకు భూసేకరణ కు చర్యలు వేగవంతం చేయాలన్నారు. మేజర్ బ్రిడ్జి, వియుపి లు ఈ నవంబర్ లోగా, ఆర్ఓబి డిసెంబర్ లోగా పూర్తి చేయాలన్నారు. కొదుమూరు వద్ద 400 కెవి ఇహెచ్ టి షిప్టింగ్ పనులు రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు సమావేశమై పూర్తిచేయాలన్నారు నాగపూర్-అమరావతి ప్యాకేజి-1 మరియు 2 భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ లోగా పరిహార చెల్లింపులు పూర్తిచేసి, భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఎన్ హెచ్ఏఐ పిడి లు రామాంజనేయ రెడ్డి, దివ్య, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :