Wednesday, 04 March 2026 01:50:50 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

చైనా మాంజా వాడితే కఠిన చర్యలు – వీణవంక ఎస్‌ఐ ఆవుల తిరుపతి


SOUDAMALLA. YOHAN

Reporter

Date : 06 January 2026 11:31 AM Views : 226

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ : కరీంనగర్/వీణవంక/జనవరి 06/అక్షరం న్యూస్: వీణవంక మండల పరిధిలో చైనా మంజా (నైలాన్ దారాలు) వినియోగం పూర్తిగా నిషేధమని వీణవంక ఎస్‌ఐ ఆవుల తిరుపతి స్పష్టం చేశారు. పండగల సందర్భంగా గాలిపటాలు ఎగరేసే సమయంలో చైనా మంజా వాడటం వల్ల పక్షులు, పశువులు, ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉందని తెలిపారు. గతంలో చైనా మంజా కారణంగా ప్రాణనష్టం కూడా సంభవించిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. పండగల ఆనందం కోసం ఇతరుల కుటుంబాల్లో విషాదం నింపేలా ప్రవర్తించకూడదని ప్రజలకు సూచించారు. చైనా మంజా తయారీ, అమ్మకం, నిల్వ, వినియోగంలో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఈ విషయంలో జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలు సహజమైన పత్తి దారంతో తయారైన మంజాను మాత్రమే వినియోగించి, సురక్షితంగా పండగలను జరుపుకోవాలని ఎస్‌ఐ ఆవుల తిరుపతి కోరారు. పోలీస్ శాఖకు సహకరించి, ఏమైనా చైనా మంజా విక్రయాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :