AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 10 వైరా (అక్షరంన్యూస్) వైరాలోని గతంలో ఉన్న కెవి సీఎం డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన ఎం జె పి టి బి సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు బుధవారం వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినల అవసర నిమిత్తం ఫ్రిజ్ ను ఈరోజు ఫాస్ట్ జిల్లా గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా మురళీకృష్ణ వివరిస్తూ స్థానిక తహసీల్దార్ మరియు ప్రిన్సిపాల్ రాధిక సంప్రదించారని వారి పిలుపుమేరకు పాఠశాల పరిసరాలను గదులను చదువు ఫ్యాకల్టీ విషయాలను అడిగి తెలుసుకుని ఈ పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరారని డాక్టర్ కాప మురళీకృష్ణ తెలిపారు 400 మంది ఉన్న విద్యార్థినుల కోసం ముఖ్యంగా వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ కావాలని అదేవిధంగా పాలు పెరుగు ఉంచడానికి ముందుగా ఫ్రిజ్ అవసరమని వారు తెలిపారు వారు అడిగిన వెంటనే ముందుగా ఫ్రిజ్ ను ఉండ్రు శ్యాంబాబు వరలక్ష్మి దంపతుల కుమారుడు అజయ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అందించామని ఈ సందర్భంగా తెలిపారు మిగతా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని మురళీకృష్ణ తెలిపారు. అడిగిన వెంటనే లయన్స్ క్లబ్ ప్రముఖులైన డాక్టర్ కాపా మురళీకృష్ణ లగడపాటి ప్రభాకర్ రావుఉం డ్రు శ్యాం బాబు సదుపాయాలు కల్పిస్తాన హామీ ఇచ్చినందుకు వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్ రావు జిల్లా విజన్ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు రీజియన్ సెక్రటరీ పెనుగొండ ఉపేందర్ క్లబ్ అధ్యక్షులు వైబుచ్చి రామారావు సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరావు జోన్ చైర్మన్ చింతోజు నాగేశ్వరరావు ఎల్ సి ఐ ఎఫ్ కోఆర్డినేటర్ తోటకూర శ్రీకాంత్ గ్రేట్ విజన్ క్లబ్ సెక్రటరీ గంగవరపు కిషన్ రాయి కోశాధికారి ఉయ్యూరి రామకృష్ణ ఏపూరి రాజారావు మరికంటి రాంగోపాల్ అజయ్ బాబు ఉపాధ్యాయులు జరీనా కమల మౌనిక మౌనిక తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily