Saturday, 18 April 2026 03:04:04 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

స్టెల్లా మెరీస్ పాఠశాలను సందర్శించిన మండల విద్యాధికారి.... సింహరాజు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 19 July 2025 07:15 PM Views : 597

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/బూర్గంపాడు మండలం/మొరంపల్లి బంజర. అక్షరం న్యూస్ /జులై 19: బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామంలో స్టెల్లా మెరిస్ పాఠశాలను బూర్గంపాడు మండల విద్యా అధికారి సందర్శించి విద్యార్థులను ఆయా తరగతుల లీడర్లుగా నియమించారు. స్టెల్లా మెరిస్ పాఠశాల చక్కని వాతావరణంలో విశాలమైన స్థలములో ఉందని విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నారని ప్రిన్సిపాల్ సిస్టర్ సుమలతను కొనియాడారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు మనిషి జీవితాన్ని మారుస్తుంది, జ్ఞానాన్ని అందిస్తుంది, ఆర్థిక అభివృద్ధి చెందటానికి సహాయపడుతుంది మరియు సమాజంలో గౌరవం సంపాదించడానికి తోడ్పడుతుంది చదువుకోవడం ద్వారా మనం కొత్త విషయాలను తెలుసుకుంటాం ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం మరియు సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుటయేగాక చదువుకున్న వ్యక్తులు మంచి ఉద్యోగాలు సంపాదించడానికి మరియు ఆర్థికంగా స్వతంత్రులు కావడానికి దోహదపడుతుందని వారు మాట్లాడటం జరిగింది . ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉండాలని క్రమశిక్షణ ద్వారా చదువు, వినయం, గౌరవం, మంచి స్థాయిని పొందుతారని వారు తెలియజేశారు, చదువుకోవడం ద్వారా వివిధ సంస్కృతులు సంప్రదాయాలు మరియు చరిత్ర గురించి తెలుసుకోవచ్చు ఇది మరింత సమగ్రమైన అవగాహనకు దారితీస్తుందని వారు తెలియజేశారు. చదువు సమాజంలో గౌరవాన్ని మంచి పేరును గుర్తింపును తీసుకొస్తుందని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని దేశం అభివృద్ధి చెందడానికి చదువుకున్న పౌరులెంతో అవసరమని చదువుకున్న ప్రజలు దేశానికి ఆర్థికంగా సామాజికంగా ఎంతో ఉపయోగపడుతారని చదువు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనదని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ పాఠశాలను సందర్శించి విద్యార్థులను లీడర్లుగా నియమించి వారికి సలహాలు సూచనలు అందించినందుకు మా యొక్క యజమాన్యాం మరియు అధ్యాపకుల తరపున మండల అధికారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు మా పాఠశాలకు రావటం ఎంతో ఆనందాన్ని కలగజేసిందని వారు పలికిన ప్రతి మాటలో సత్యం ఉందని కొన్ని కొత్త విషయాలను మేము తెలుసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సుమలత గారు తెలియజేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :