D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం/ తల్లాడ/ సెప్టెంబర్ 4 (అక్షరంన్యూస్) తల్లాడ మండలంలోని కేశవాపురం గ్రామంలో రామాలయం వద్ద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉత్సవ కమిటీ సభ్యులు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రజలందరూ పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామికి పూజలు చేశారు. కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, నాయకులు కటికి కిరణ్ కుమార్, గోవిందు శ్రీనివాసరావు హాజరు కావడంతో వారిని కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించి సత్కరించారు. అనంతరం గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమంలో మహిళా భక్తులు, చిన్నారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాదం కృష్ణ, చిన్నంశెట్టి శ్రీకాంత్, చావా విష్ణువర్ధన్ రావు, సాదం నరేష్, పసుపులేటి రామకృష్ణ, కోలా మంగయ్య, కట్టా రామారావు, కట్టా వీరేందర్, అడపాల నాగేశ్వరావు, చుండూరి హనుమంత్, అమరం లక్ష్మయ్య, కట్టా సాయి, బోడెపుడి శ్రీనివాస్, కొంకి తిరుమలరావు, గోపాల్, ఖమ్మంపాటి హరీష్, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily