Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఏప్రిల్ 29 అక్షరం న్యూస్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు ఈ మేరకు ఏసిపి కృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ భార్య శైలజ తో సమీప బంధువు పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పోలం కుమార్ సన్నిహితంగా ఉండేవాడు భార్య తరచూ ఫోన్లో అతడితో మాట్లాడుతుండటంతో వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని సంతోష్ అనుమానించాడు ఈ విషయంమై ఆమెని మందలించాడు కుమార్ తన వెంట పడుతున్నాడని చెప్పిన శైలజ అప్పటి నుంచి అతడిని దూరం పెట్టింది అనంతరం అతని భార్య జోలికి రావద్దు అంటూ కుమారును సంతోష్ బెదిరించాడు ఈ విషయాన్ని కుమార్ బంధువులకు చెప్పడంతో శైలజకు తరచూ ఫోన్ చేస్తుండడంతో బంధువుల వద్ద పరువు పోతుందని సంతోష్ అతనిపై కోపం పెంచుకున్నాడు పథకం ప్రకారం మాట్లాడుకుందామంటూ పెద్దపల్లి మార్కెట్ యార్డ్ కు కుమారును పిలిచాడని తెలిపారు సంతోష్ జెండా వద్ద కత్తి కొనుగోలు చేసి తర్వాత భార్యను తీసుకొని అక్కడికి కలిసి వచ్చారని వ్యూహం ప్రకారం కుమార్ తొ గొడవ పడిన సంతోష్ కత్తితో అతడి మెడపై పొడిచాడు ఆ సమయంలో కుమార్ ఎదురు తిరగకుండా శైలజ అతని చేతులు పట్టుకుందని అనంతరం కుమార్ ముఖంపై చాతిపై సంతోష్ పొడిచాడని కుమార్ తప్పించుకునే క్రమంలో శైలజ తో పాటు సంతోష్ కు కూడా గాయాలయ్యాయని కింద పడిపోయిన కుమారుని సంతోష్ మరోసారి పొడిచి మెడ పొట్టపై నిల్చోని చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి పారిపోయాడని వెల్లడించారు నమ్మదగిన సమాచారం ప్రకారం సిఐ ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి నిందితులు సంతోష్ శైలజను ధర్మారం మండలం దొంగతుర్తి వారి ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు ఏసీపి గజ్జి కృష్ణ తెలిపారు వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి రక్తం మరకలు కలిగిన దుస్తులు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు
.
Aksharam Telugu Daily