Wednesday, 04 March 2026 01:43:16 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తుఫాన్ మొంథా ఎఫెక్ట్ తో రైతులు విలవిల రైతులకు ఊహించని కష్టాలు

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 29 October 2025 04:16 PM Views : 532

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/అక్టోబర్-29(అక్షరం న్యూస్) ముస్తాబాద్ మండల వ్యాప్తంగా మొంథా తుఫాన్  ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో స్వల్పకాలిక రకాలైన వరి వంగడాలను కొద్దిగా గొప్ప వరి కోతలు కోసిన రైతులు తమ ధాన్యాన్ని ఉదయం పూట ఆరవస్తు సాయంత్రం పూట పోగుచేస్తూ అవస్థలు పడుతున్నారు. సాధారణంగా రైతులు ఒకసారి ధాన్యాన్ని ఆరబోస్తే పూర్తిగా ఆరినాక కుప్పగా చేసుకొని శుభ్రం చేసుకుంటారు. తుఫాన్ ప్రభావంతో పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో ఆకాశంలో మబ్బులు వస్తుండడంతో ఎక్కడ ధాన్యం తడిసిపోతుందో వర్షపు వరదలకు కొట్టుకుపోతుందో అన్న భయం రైతులను వెంటాడుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ఓపెన్ కాకపోవడం వర్షం పడితే కప్పడానికి టార్పాలిన్స్ లేకపోవడం లేక రైతులు అవస్థ పడుతున్నారు. చేతి కాడికి వచ్చిన పంట నోటి నోటి దాకా రాదేమోనన్న భయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం మరో రెండు మూడు రోజులు ఉంటుందన్న వార్త కథనాలతో రైతులు హడలిపోతున్నారు. మరికొంత ఏరియాలో వరి కోతలు కోసేందుకు సిద్ధంగా ఉండడంతో తుఫాన్ అలెర్ట రైతులు కోతలను నిలిపివేశారు. మొంథా తుఫాన్ ప్ర‌భావంతో రైతుల‌ను తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌ద్ద రైతుల పంట త‌డిసిపోతుంది. మ‌రికొంద‌రూ ఆర‌బెట్టుకోవాల‌ని ధాన్యం కొనుగోలు వ‌ద్ద‌కు వ‌స్తే.. ధాన్యం ఆరేది ఏమో కానీ త‌డిసేదే ఎక్కువగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీదు చేసిన ధాన్యాన్ని కాంట వేయించి వెంటనే తరలించే విధంగా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు మొత్తానికి మొంథా తుఫాన్ రైతుల‌ను క‌న్నీరు పెట్టించేందుకే వ‌స్తుంద‌ని వాపోతున్నారు రైతులు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :