D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం / ఏప్రిల్ 2 (అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పుట్టల భూపతి గ్రామానికి చెందిన సోలం రవికుమార్ వయసు 35 సంవత్సరాలు రోజు మాదిరిగానే తన మొక్కజొన్న చేను కావలికి వెళ్ళగా అప్పటికే చేనులో పంటను తింటూ ఉన్న అడవి పంది ఒక్కసారిగా వచ్చి రవికుమార్ పై దాడి చేసి ఎడమ కాలు తొడను మోకాలిని కొరికి తీవ్ర గాయాలు చేయగా చుట్టుప్రక్కల చేనులవాళ్లు వచ్చి అరవడంతో అడవి పంది అక్కడనుండి అడవిలోకి వెళ్లిపోయింది కుటుంబ సభ్యులు వెంటనే రవికుమార్ ను 108 లో నర్సంపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా తీవ్ర గాయాల పాలైన రవికుమార్ కు డాక్టర్లు తొంటికి ఆపరేషన్ చేశారు. రవికుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మండలంలో ఎప్పుడూ లేని విధంగా అడవి పంది దాడి చేయడంతో రైతులు తమ పంటలు చేతికి రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది ఇలా అయితే మా చేను దగ్గర ఎలా కాపలా ఉండాలి అని గ్రామ రైతులు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు.
.
Aksharam Telugu Daily