AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : సుల్తానాబాద్ ఆగస్టు 05 అక్షరం న్యూస్ సుల్తానాబాద్ మండల సర్వసభ్య సమావేశ మందిరంలో ఎంపీడీవో దివ్యదర్శన్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్. చింతకుంట విజయరమణ రావు ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... సమావేశంలో మండలంలోని గ్రామాల సర్పంచులు తెలియజేసిన గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామాలలో తాగునీటి సమస్యలను సర్పంచులు ప్రస్తావించగా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది అని తెలియజేశారు. ప్రజల త్రాగునీటికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత డి.ఈ, ఏ.ఈ లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మండలంలో రైతులకు సకాలంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా నిరందించేలా పూడికతీతలు తీసి నీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గత 40, 50 సంవత్సరాలుగా కాలువలు కూడుకుపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కున్నారని దాదాపు 2000 ఎకరాలకు నీరు అందేలా నూతనంగా ఎన్నికైన సర్పంచుల సహకారంతో జెసిబిలతో కాల్వలను పూడిక తీపించడం జరిగిందని వివరించారు. అలాగే నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులైన బాత్రూమ్లు, ప్రహరీల నిర్మాణం, పాస్ ఏరియాల, మంచినీటి సౌకర్యాల కల్పనకు కృషి చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతిలో సుల్తానాబాద్ మండల టాపర్ గా స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన సిరివల్లి క 585 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచారని ఇంటర్మీడియట్ లో వి. సౌమ్య 1000 మార్కులకు 994 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్ గా నిలవడం గర్వకారణమని తెలిపారు. వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచే విధంగా సర్పంచులు కృషి చేయాలని సూచించారు. విద్య రంగంపై జిల్లా కలెక్టర్ మరియు మేము ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఫలితాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనపై లిఖితపూర్వకంగా మండల విద్యాధికారి, ఎం.పీ.డీ.వో లకు సర్పంచ్ లు దరఖాస్తులు వ్రాసి అందించాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సమావేశం వివిధ అంశాలపై కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, తాసిల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీఓ దివ్య ధర్షన్ రావు, మండలంలోని సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, చిలుక సతీష్, కల్లేపల్లి జానీ, మురళిధర్ రావు, భాస్కర్ రెడ్డి, నమని రాజిరెడ్డి,అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు మరియు పలువురు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily