P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జూన్15 (అక్షరం న్యూస్) ఓదెల మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వస్తే స్వామివారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకుంటానని ఓదెల గ్రామానికి చెందిన వివేక్ వెంకటస్వామి వీర అభిమాని ఓదెల మాజీ వార్డు సభ్యులు అల్లం సతీష్ మొక్కుకోవడంతో అల్లం సతీష్ కోరిక మేరకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ఆలయానికి వచ్చి మొక్కలు చెల్లించుకున్నారు మంత్రి పదవి పొందిన మొదటి సారి ఆలయానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకట స్వామికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయానికి ఆహ్వానించారు ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు అర్చనలు చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం ఆలయ ఈవో బి సదయ్య మంత్రిని శాలువతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మా నాన్న వెంకటస్వామి కాక ఎంపిగా ఉన్నప్పటినుండి ఓదెల మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండేదని అప్పటినుండి ఇప్పటివరకు మా కుటుంబానికి విడదీయలేని బంధం అని కాకా వెంకటస్వామి ఎప్పటికీ ఓదెల మండల ప్రజలకు గుర్తుండిపోయే వ్యక్తిని అదే బాటలో ప్రయాణిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళతామని అదేవిధంగా మంత్రి అయిన నేను ఎంపీగా ఉన్న తన కుమారులు వంశీకృష్ణ తో కలిసి ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు అదేవిధంగా ఓదెల గ్రామంలో అనేకమంది మా అభిమానులు ఉన్నారని మీ అందరి కృషితో ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి అయ్యేవిధంగా కృషి చేస్తానని తప్పకుండా ఆలయ అభివృద్ధికి తోడ్పడుతానని ఆ స్వామివారి దయ అందరిపై ఉందని ఆ కృపతోటే ఈరోజు నాకు మంత్రి పదవి రావడం జరిగిందని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి వీర అభిమాని అల్లం సతీష్ మరియు. గుండేటి ఐలయ్య యాదవ్ మాజీ సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్పీ రాజయ్య గౌడ్ పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ నాంసానిపల్లి మాజీ సర్పంచ్ ఇరవేణి శంకర్ ముదిరాజ్ ఆవుల ముత్తయ్య గోషిక రాజేశం బండి సది శ్రీధర్. బిక్షపతి వంగ రవీందర్ శ్రీనివాస్ సాతూరి రాజేశం ఆసమ్ ఎర్రయ్య శివ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరాభిమానులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily