Saturday, 18 April 2026 06:50:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పండుగ వాతావరణంలో పరుగుపందెం..... రన్ ఫర్ యూనిటీ.... ముస్తాబాద్ లో 2కే రన్... పోటీ పడి పరుగులు పెట్టిన యువత... విజేతలకు బహుమతులు అందజేత...

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 31 October 2025 11:41 AM Views : 1101

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /అక్టోబర్ -31(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండల కేంద్రం లో శుక్రవారం ఉదయం 2కే రన్‌ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వహించిన 2కే రన్‌ను స్థానిక ఎస్ ఐ గణేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఇందులో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ నుండి ప్రారంభమైన రన్‌ ఏ ఎం ఆర్ గార్డెన్ వరకు సాగింది.ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. వందలాది స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి, దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన అచంచలమైన కృషి, అకుంఠిత దీక్ష ఎప్పటికీ మరువలేనివన్నారు. పటేల్‌ దార్శనికత, రాజనీతిజ్ఞత కారణంగానే నేడు మనం చూస్తున్న సమగ్ర భారతదేశం సాధ్యమైందని వెల్లడించారు. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, దేశభక్తికి, త్యాగం, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనమని, ప్రజలందరినీ ఐక్యంగా ఉంచాలనే ఆయన ఆశయం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ‘రన్ ఫర్ యూనిటీ’ ద్వారా సర్దార్ పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ, మన దేశ సమగ్రతను, ఐక్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేసుకుందామని తెలిపారు. ఈ రన్‌లో పాల్గొనడం ద్వారా, మనం సర్దార్ పటేల్ వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఐక్యతా సందేశాన్ని అందిద్దామని పేర్కొన్నారు. అనంతరం పలువురు రాజకీయ యువ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉదయం నడక అల వాటు చేసుకోవాలని ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో తోడ్పాడుతుందని తెలిపారు. యోగ, వ్యాయామం చేయడంవల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు, క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :