AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 2/ అక్షరం న్యూస్/----గణేష్ నగర్ నందు గణేష్ నగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బొజ్జ గణపయ్య భక్తులచే పూజలు అందుకొని దే దివ్య మానంగా వెలుగొందుతున్నాడు. మంగళవారం నాడు ఆ లంబోదరుడికి వేద పండితులు శ్రీనివాస్ శర్మ నేతృత్వంలో అత్యంత వైభవంగా వేద మంత్రోచ్ఛారణ నడుమ గజనాధుడికి శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దివ్య స్వరూపుడైన విఘ్నేశ్వరుడిని దర్శించుకొని తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించి ఆ పార్వతీ సుతుని కృపకు పాత్రులైయ్యారు.
.
Aksharam Telugu Daily