GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -29(అక్షరం న్యూస్ ) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి . ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చల్లటి గాలులకు జనం ఇంటికే పరిమితమయ్యారు. దాంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు.రోడ్లన్నీ బురదమయంగా మారాయి. డ్రైయినేజీ కాల్వల్లో నీళ్లు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరిందివర్షం కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గింది. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి.
.
Aksharam Telugu Daily