AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్/ కుత్బుల్లాపూర్ : : అక్షరం ప్రతినిధి మేడ్చల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పట్టించుకోవడం లేదని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ "మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి" అని అన్నారు. "మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ వంటి చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడో ఒకచోట ఏదో విధంగా మహిళలపై అఘాయిత్యాలు జరగడం అమానుషం. ఇది సమాజానికి సిగ్గుచేటు" అని ఆవేదన వ్యక్తం చేశారు. "మహిళల రక్షణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వారికి పూర్తి రక్షణ కల్పించాలి. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి" అని యూఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
.
Aksharam Telugu Daily