GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/ఆగష్టు-01(అక్షరం న్యూస్) రోడ్డు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషనలో ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన వాడడంతోపాటు, పెద్ద శబ్దంతో పాటలు ప్లే చేసే ట్రాక్టర్ డ్రైవర్లను ఉపేక్షించేది లేదన్నారు. డ్రైవర్లు లైసెన్సలు కలిగి ఉండడంతోపాటు, వాహన రికార్డులు ఐనా ప్రతి ట్రాక్టర్ నెంబర్ ప్లేట్, ఇన్సూరెన్స్, ఆర్ సీ తప్పకుండ కలిగి ఉండాలని, మైనర్లను డ్రైవర్ల గా పెట్టకూడదన్నారు. ఎవరయినా ఇసుక, మట్టి అనుమతి లేకుండా తరలిస్తే చట్ట ప్రకారం కేసులు చేస్తామన్నారు. .ట్రాలీలకు వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లను అతికించుకోవాలన్నారు. నిబం దనలు పాటించని వాహనాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశం లో ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily