D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్/9 వైరా (అక్షరంన్యూస్) ఠాగూర్ విద్యా సంస్థలైన శ్రీ క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కాలోజి నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు చిత్రపటానికి విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ భాషలోని యాసను మాధుర్యాన్ని తన రచనలలో పొందుపరచి తెలంగాణ వానిని ఎలుగెత్తి చాటిన ప్రజాకవి, ప్రజల మనిషి, చైతన్య మూర్తి కాళోజీ అని, పుట్టుక నీది చావు నీది... బ్రతుకంతా దేశానిది అంటూ ఆయన జీవిత కాలమంతా ప్రజా ఉద్యమాలకు ధారపోసిన మహా మనిషి అని, అన్యాయాన్ని ఎదిరించిన కాలోజీ కలము నుండి జాలువారిన ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క తూట... భావితరాలకు పోరాట స్ఫూర్తిని నింపిన నిరసన కెరటం అని నినాదించిన మహానీయుడు కాలోజీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. విద్యాసంస్థల డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లింగారావు, మజీద్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily