AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 4/ అక్షరం న్యూస్ ---- ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ( ఆగస్టు 9) ఘనంగా నిర్వహించాలని గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకుడు పాయం సత్యనారాయణ మంగళవారం నాడు సి కత్తిగూడెం నందు ఆదివాసి ప్రజానికానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించాలని. ఆదివాసి ఉద్యోగస్తులకు ఆప్షనల్ హాలిడే ప్రకటించాలని ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ జేఏసీ చైర్మన్ పాయం సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలకు కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసి విద్యార్థి రాష్ట్ర కన్వీనర్ ఇర్ప ప్రకాష్ దొర చర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ ఇర్ప అరుణ్ కుమార్ ఇర్ప తులసమ్మ. కొమరం నాగేశ్వరరావు గ్రామ యువకులు పెద్దలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily