Friday, 06 March 2026 03:04:06 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కష్టపడి చదివి బంగారు బాట నిర్మించుకోండి ఎం ఆర్ ఎఫ్ డీలర్ పాండురంగ

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 01 September 2025 07:17 PM Views : 707

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 1/ అక్షరం న్యూస్/----విద్యార్థులు కష్టపడి చదివి బంగారు బాటను నిర్మించుకోవాలని చర్లలోని ఎం ఆర్ ఎఫ్ టైర్స్ డీలర్ నల్లూరి పాండురంగ అన్నారు. సోమవారం నల్లూరి పుల్లయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు నల్లూరి సత్యనారాయణ, పాండురంగ, మురళి లు చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయంకు రూ. వేల నగదును అందచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్దుల అభ్యున్నతికి విద్యార్ది నిలయం ఏర్పాటు చేయడం అబినందనీయమని అన్నారు. విద్యార్దులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. విద్యతోనే మానవజాతి మనుగడ ముడిపడి ఉన్నదని, కుటుంబంలో ఒక్కరు చదువుకొని జీవితంలో స్దిరపడితే ఆకుటుంబం మొత్తం స్దిరపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు చర్లలోని పూజారిగూడెం ప్రభుత్వ పాఠశాల ప్రదానోపాద్యాయుడు చిట్టిబోతుల వేణుగోపాల్ తన తల్లిదండ్రులు చిట్టిబోతుల లక్షి - వెంకయ్యల జ్ఞాపకార్థం విద్యార్ది నిలయంకు 50 కేజీల బియ్యం, విద్యార్దులకు ఒకపూట బోజనం, పండ్లను అందచేసారు. కార్యక్రమంలో వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, కొమరం భీం నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, సభ్యురాలు పోలిన రమాదేవి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :