Thursday, 15 January 2026 07:50:09 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పెద్దపల్లి పట్టణ పెరిక (పురగిరి క్షత్రియ) కో-ఆపరేటివ్ సొసైటీ పట్టణ కమిటీ ఎన్నికలు .. అధ్యక్షులుగా చుంచు ఆంజనేయులు

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 24 December 2025 05:48 PM Views : 276

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ డిసెంబర్ 24 అక్షరం న్యూస్; పెద్దపల్లి పట్టణంలోని పెరిక (పురగిరి క్షత్రియ) కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ కమిటీ ఎన్నికలు ఆదివారం కుల మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. “ఒక్కరి కోసం అందరం… అందరి కోసం ఒక్కరు” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ ఐక్యత, సామాజిక అభివృద్ధిపై నాయకులు ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ ఎన్నికల్లో చుంచు ఆంజనేయులు ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కర్రె రాజేశం, ముత్తినేని మల్లయ్య ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా చుంచు కనకయ్య, ఖజానాదారుగా ( కోశాధికారిగా) కర్రె ప్రవీణ్, సంయుక్త కార్యదర్శిగా నరెడ్ల రమేష్, మీడియా కార్యదర్శిగా దొమ్మటి రాజేష్ ను నియమించారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా కర్రె రాజు, చుంచు సురేష్, కొట్టె సత్యం, వక్కల రాజు, ఎంబడి గట్టయ్య, దొమ్మటి రాజేందర్, దొమ్మటి మల్లయ్య, కొట్టె లక్ష్మీ రాజం లను ఎన్నుకున్నారు. సంఘానికి గౌరవ అధ్యక్షులుగా కొట్టె సదానందం, చుంచు మల్లయ్య, కర్రె చంద్రయ్య లను నియమించగా, గౌరవ సలహాదారుగా కారుకూరి సుధాకర్ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియను పరిశీలకులుగా లగిశెట్టి చంద్రమౌళి మరియు మంద సాయి ప్రణీత్ గార్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ కుల మిత్రుల సంక్షేమం, ఐక్యత కోసం సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :