GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /మార్చి -02(అక్షరం న్యూస్ ) సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరము కోసం . గురువారం ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఆయా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. గ్రామ సభల ఆరంభంలో రాష్ట్ర గీతం ఆలపించి సభలను ప్రారంభించి సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, పెంచిన పింఛన్ల పథకాలపై గ్రామస్తులకు సమగ్రంగా అవగాహన కల్పించారు.గ్రామాల్లో సమస్యలు ఉంటే సభలో తమ దృష్టికి తీసుకురావాలని, లబ్ధిదారులకు పింఛన్లు, ఇతరత్రా సమస్యలుంటే దరఖాస్తు చేసుకుంటే 99 రోజుల ప్రణాళికలో భాగంగా వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆయా పంచాయతీల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు సక్రమంగా అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను ప్రజలు వారి సమస్యలను అడిగి నివృత్తి చేసుకున్నారు ఈ గ్రామ సభల్లో ఆయా పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శులు, గ్రామస్తులు, వివిధ శాఖ ల అధికారులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily