AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : * భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు/సెప్టెంబర్ 18/అక్షరం న్యూస్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ లావాదేవీల పై విధించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఉపసమరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జూలూరుపాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ క్రిష్ణ మాట్లాడుతూ దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్సిటీ చెల్లింపులు ఎప్పట్లాగానే సాధారణ ప్రజలకు పూర్తి ఉచితంగా ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో, కేంద్రం, అమెరికా ప్రయోజనాల కోసమే పన్నును పద్ధతిని తీసుకొచ్చిందని వారు ఆరోపించారు, సాధారణ ప్రజలకు పూర్తి ఉచితంగా ఉంటాయంటూ వాణిజ్య లావాదేవీల సైతం అతి స్వల్ప పరిణామం మాత్రమే పన్ను విదిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదన సరికాదని అన్నారు. వాణిజ్య సంస్థలు ఈ పన్ను పోటును వినియోగదారుల నుండే ముక్కు పిండి వసూలు చేస్తారన్న విషయం కేంద్రానికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అన్ని రకాలుగా 30 వేల కోట్లకు పైగా దేశ ప్రజలపై భారం పడనుందని క్రిష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత టాక్స్ చెల్లిస్తున్న ప్రజలు అది ప్రభుత్వానికి ఉపయోగపడకపోగా ప్రభుత్వ ధనాన్ని ఆస్తులని కార్పొరేట్ శక్తులకు రకరకాల పేరిట అప్పజెప్తున్న వైనాన్ని మరవరాదని అన్నారు. బ్రిటిష్ వారు ఇండియాకు టీ కాపీలను ఉచితంగా అలవాటు చేసి లక్షల కోట్ల వ్యాపారం నేడు చేస్తున్నట్లు అమెరికా యూపీఐ లావాదేవీల కంపెనీలు 10 ఏళ్లు ఉచితంగా సేవలు అందించి ప్రజలందరికీ అలవాటు అయిన తర్వాత ఈరోజు తొలిత వాణిజ్యానికి తర్వాత సామాన్యులపై ఈ పన్ను పోటు పెంచే ప్రమాదం ఉందని అన్నారు. తక్షణమే ఆన్లైన్ లావాదేవీలపై కేంద్రం విధించిన పనులను ఎత్తివేసి మరింత సరళంగా ఆన్లైన్ చెల్లింపులు జరిగేటట్లు చూడాలని కోరారు. ఇప్పటికే మోడీ పాలనలో అన్ని రకాల ధరలు ఆకాశానంటేయని అన్ని రకాల నిజ వేతనాలు పాతాళానికి పడిపోతున్న ఈ నేపథ్యంలో మరికొంత భారాన్ని వేయటమంటే మూలీగే నక్కపై తాటిపండు పడ్డ చందమే నని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే డిజిటల్ లావాదేవీల పై విధించిన పన్నును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఏదులాపురం గోపాలరావు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాజశేఖర్, రైతు సంఘం జిల్లా నాయకులు బైరు వెంకన్న, తోటకూరి నరేష్, మదు,రమేష్, సేవ్యా,తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily