GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/ఆగష్టు-01(అక్షరం న్యూస్) ముస్తాబాద్ మండల పరిధిలోని అక్రమంగా అవునూర్ గ్రామ శివారులో మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిసున్న ఇసుక ట్రాక్టర్ ను గురువారం సాయంత్రం పట్టుకున్నట్లు ఎస్ ఐ గణేష్ ఒక ప్రకటన లో తెలిపారు.వెంకటాపూర్ గ్రామానికి చెందిన మామిండ్ల పర్శరాములు, రాం లక్ష్మణ పల్లి గ్రామనికి చెందిన ట్రాక్టర్ యజమాని పాక రామస్వామి ని పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు ఒక ప్రకటన లో తెలిపారు ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే డ్రైవర్, ఓనర్ లపై కేసులు నమోదు చేస్తే రిమాండ్ కు తరలిస్తామని హెచ్చరించారు
.
Aksharam Telugu Daily