Sunday, 23 August 2026 03:58:36 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మానవతను చాటుకున్న గాయత్రి విద్యార్థులు.. బాధిత కుటుంబానికి రూ.32 వేల ఆర్థిక సాయం

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 22 August 2026 04:51 PM Views : 35

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 22 అక్షరం న్యూస్ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి పెద్దపల్లి గాయత్రి విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల బసంత్‌నగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి మండలం చీకురాయికి చెందిన పినకాశి సతీష్‌ కుటుంబానికి రూ.32 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రమాదంలో సతీష్‌ కుటుంబ పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న గాయత్రి విద్యాసంస్థల చైర్మన్‌ అల్లెంకి శ్రీనివాస్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. సతీష్‌ భార్య, కుమారుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాయత్రి విద్యానికేతన్‌, గాయత్రి జూనియర్‌ కళాశాల, గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు తమ వంతు సాయంగా సేకరించిన రూ.32 వేల విరాళాన్ని సతీష్‌కు అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి విద్యార్థులు స్పందించి ఆర్థికంగా అండగా నిలవడం అభినందనీయమని అల్లెంకి శ్రీనివాస్‌ అన్నారు. ఆకుటుంబానికి అండగా దాతలు ముందుకు రావాలి.. సతీష్‌ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అల్లెంకి శ్రీనివాస్‌ తెలిపారు. ప్రమాదం కారణంగా చికిత్సకు భారీగా ఖర్చవుతున్న నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించాలని కోరారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు మరింత మంది స్పందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు తమ వంతుగా విరాళాలు సేకరించి కుటుంబానికి అందించడం ద్వారా మానవత్వాన్ని చాటారని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే భావన విద్యార్థుల్లో పెంపొందించడం అవసరమన్నారు. సమాజంలో సేవా దృక్పథం పెరగడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :