AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల అక్టోబర్ 4/ అక్షరం న్యూస్/---- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా సిపిఐ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు నానిపెళ్లి భద్రం అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో. సిపిఐ శ్రేణులు ఎంపీటీసీ సర్పంచి స్థానాలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ బలంగా ఉన్న ఎంపీటీసీ సర్పంచ్ స్థానాల్లో సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తారని సిపిఐ లో పోటీ చేసే ఆశావాహులు అభ్యర్థులు ఉన్నారని పార్టీ నిర్ణయం మేరకు సిపిఐ అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు మిత్రపక్షంగా ఉండే పార్టీతో ఒత్తులు పెట్టుకునే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ మండల కార్యదర్శి నుప పోతయ్య సీనియర్ నాయకులు నూప తిరుపతిరావు సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ పాల్వంచ రామారావు మండల సహాయ కార్యదర్శి సల్ల లక్ష్మీనారాయణ కోటి ముత్యాలరావు మండల కార్యవర్గ సభ్యులు పాలెం సత్యనారాయణ కల్లూరి సీతారాములు మోట్ల రాజు ఉప్పులూరి నాగరాజు కోట శంకర్ కోడి రెక్కల రాజారావు మడకం నానాజీ కట్టం నాగేశ్వరరావు మాజీ ఎంపీటీసీ పోడియం ఆదిలక్ష్మి దబ్బా శంకర్ నూప కన్నారావు మల్లన్న నాగేశ్వరరావు ఎస్కే జాకీర్ హుస్సేన్ ఎస్.కె ఖాజా నుప రాము గుండి సమయ దబ్బా నాగేశ్వరరావు నూప మోతీరు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily