Thursday, 15 January 2026 06:44:32 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు...

-విద్యార్ధులు ధైర్యంగా వుండాలి -


MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM.

Reporter

Date : 22 April 2025 11:07 AM Views : 1561

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా/అక్షరం న్యూస్  :తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరిక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ప్రతి ఏడాది ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన, ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు నమోదవుతున్నాయి. పేరున్న విద్యాసంస్థలలో చేర్పించాలనే తల్లిదండ్రుల ఆశయాలు పిల్లలపై అనవసర ఒత్తిడిని పెంచుతున్నాయి. విద్యార్థుల నైపుణ్యాలను గుర్తించకుండా చదువు, మార్కుల పైనే దృష్టి పెట్టడం వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పోటీ యుగంలో మార్కులు, ర్యాంకుల ఆధారంగా మాత్రమే ప్రతిభను అంచనా వేయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పరీక్షలలో ఆశించిన ఫలితాలు రాకపోతే విద్యార్థులు తాము పరాజయాన్ని ఎదుర్కొన్నట్లు భావిస్తూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చదువు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, అది జీవితాన్ని నిర్ణయించదని పిల్లలు గ్రహించకపోవడం అత్యంత విచారకరం. తల్లిదండ్రుల కోపం, నిరాశతో భయపడుతూ చిన్నారులు తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యా సంస్థల్లో పోటీ, ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి మధ్య విద్యార్థులు తట్టుకోలేక నిష్ప్రయోజనత భావంతో తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలతో స్నేహంగా మెలిగి, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. వారు ఫెయిల్ అయినా, అది చివరి అవకాశం కాదని గుర్తు చేయాలి. మే నెలలో జరిగే సంప్లిమెంటరీ పరీక్షలు మరొక అవకాశం కల్పిస్తాయి. విద్యార్థులు ధైర్యంగా ఉండాలి. ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించదనే విషయాన్ని మనస్సులో గట్టిగా నాటుకోవాలి. మనోధైర్యమే భవిష్యత్తుకు బలమైన శ్రేయస్సు మార్గమని తెలుసుకోవాలి.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :