D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ/ఆగస్టు/ 17 (అక్షరంన్యూస్) తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో సోదా నరసింహారావు ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమం కన్నుల పండగ జరిగింది. ఈ విగ్రహాసన కార్యక్రమంలో రంగా వారసుడు వంగవీటి రాధా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దాయానంద్ పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. తొలుత వంగవీటి రాధాకు కల్లూరు నుండి మున్నూరు కాపు సోదరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి భారీ బైక్ ర్యాలీతో రామచంద్రపురం తీసుకొని వచ్చారు రంగా విగ్రహం ఆవిష్కరణ అనంతరం జరిగిన కార్యక్రమంలో . వంగవీటి రాధా మాట్లాడుతూ జిల్లాకు సరిహద్దులు ఉంటాయి రాష్ట్రానికి సరిహద్దులు ఉంటాయి కానీ అభిమానానికి సరిహద్దులేదు అని చాటిచెప్పిన రంగ అభిమానం . రంగ ఒక కులం నాయకుడు కాదు పేద బడుగు బలహీన వర్గాలకు ఒక అండ, అలాంటి నాయకుడు నేటికీ ప్రజల హృదయాలలో జరిగిన ముద్ర వేసుకున్నాడు అంటే ప్రజల కోసం ఎంత చేసి ఉంటాడో ఆలోచించాలి అని అన్నారు. ఎమ్మెల్యే మట్టా దయానంద్ రాగమయి మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా అంటే బడుగు బలహీన వర్గాలకు నిజమైన ఆశాజ్యోతి పేదలకు పెన్నిధి సమస్యలన్నీ వారి సమస్యల పట్ల పోరాడిన నాయుకుడు , ఆయన రాజకీయ రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చి మంచి ఎమ్మెల్యేగా పేరు పొందిన్నారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న రాధా మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్నూరు కాపు పెద్దలు నాయకులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily