Monday, 15 December 2025 07:32:35 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి ఆదివాసి సంఘాల జేఏసీ డిమాండ్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 16 September 2025 07:19 PM Views : 549

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 16/ అక్షరం న్యూస్/---- మండల కేంద్రంలో మంగళవారం నాడు ఆదివాసి జేఏసీ ఆధ్వర్యం లో తాటి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ జేఏసీ చైర్మన్ పాయం సత్యనారాయణ దొర మాట్లాడుతూ ఈనెల 28 న భద్రాచలంలో జరగబోయే భారీ బహిరంగ సభకు ఆదివాసి గూడెల నుంచి గ్రామాల నుంచి ఆదివాసి యువత ఆదివాసి ప్రజానికం ఆదివాసి హక్కుల రిజర్వేషన్ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలని బహిరంగ సభలొ ప్రతి ఒక్క ఆదివాసి పాల్గొన్నారు. ఆదివాసి జాతి ఐక్యతను చూపాలని భారత రాజ్యాంగం 5వ షెడ్యూలు గోండు వాన భూభాగం లో రిజర్వేషన్లు ఆదిమా తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే దక్కాలని 1976లో డిఎన్టి గా (ఒకసారి డినోటిఫై ట్రైబ్) గా విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ల లొ చలామణి అవుతూ ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ల అవకాశాన్ని మొత్తం కూడా రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్ను కొల్లగొడుతూ ఆదిమ జాతులకు తీవ్రమైన అన్యాయం చేకూరుస్తున్నారని లంబాడి,మ సుగాలి బంజారా సామాజిక వర్గ ప్రజలు తీవ్ర అన్యాయం చేస్తూరని ఆదివాసి జేఏసీగా మండిపడ్డారు. అనంతరం తెలంగాణ నాయకపోడు ఆర్గనైజేషన్ సెక్రటరీ పున్నం రామకృష్ణ మాట్లాడుతూ 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఎటువంటి కమిషన్ లేకుండా మరియు రాష్ట్రపతి ఆర్డినెన్స్ లేకుండా దొడ్డి దారిన ఎస్టీ జాబితాలో చేర్చారని అన్నారు. తదుపరి ఆదివాసి విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఇర్ఫా ప్రకాష్ దొర మాట్లాడుతూ లంబాడీలు వివిధ రాష్ట్రాల్లో ఓసి బిసి ఎస్సి గా చలామణి అవుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో డినోటిఫై ట్రైబ్ గా చలామణి అవుతూ ఎస్టీ రిజర్వేషన్లు మొత్తానికి ఒక సామాజిక వర్గమే లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల ఉద్యమంలో ఆదిమవాసి యువత ముందు వరుసలో ఉండి హక్కులు రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. భద్రాచలంలో సెప్టెంబర్ 28 న జరిగే ఆదివాసి భారీ బహిరంగ సభకు ఆదివాసి తుడుం దెబ్బ, నాయకపోడు గోడ్వాన సంక్షేమ పరిషత్ వివిధ ఆదివాసి సంఘాలు, ఆదివాసి ఉద్యమ నాయకులు,సంఘాల బాధ్యులు పాల్గొని బహిరంగ సభలో ఆదివాసి యువత చర్ల మండల కేంద్రంగా 26 పంచాయతీ ఆదివాసి ప్రజానీకాన్ని చైతన్యపరిచి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి జాతి ఐక్యతను చాటి చూపాలని చర్ల మండల జేఏసీగా కోరారు ఈ కార్యక్రమంలో చర్ల మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు, జేఏసీ వైస్ చైర్మన్ వాసం ముసలయ్య దొర,జి ఎస్ పి వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ ఆదివాసుల జర్నలిస్టుల ఫోరం కనితి భాను ప్రకాష్, ఆదివాసి హక్కుల పరిరక్షణ వేదిక ఇర్పరాజు ఆదివాసి అడ్వకేట్ ఫోరం సీనియర్ న్యాయవాది పార్శిక సోమరాజు దొర గొంది లీల ప్రసాద్ దొర ఎక్స్ ఎంపీపీ గొంది ముయ్యన్న బిరబోయిన శేఖర్ మడకం శేఖర్ పోడియం జగదీష్, కనితి శ్రీను, కనితి జితేంద్ర, మడప భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :