Wednesday, 04 March 2026 01:40:36 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తల్లిదండ్రులను విస్మరిస్తే 30 రోజులలో ఇళ్లు ఖాళీ చేయాలి ..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత సంతానం పై ఉంటుంది **వయోవృద్ధుల సంరక్షణ చట్టం పరిధిలోని దరఖాస్తు పై తీర్పు వెలువరించిన జిల్లా కలెక్టర్*


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 05 July 2025 05:57 PM Views : 1101

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ** పెద్దపల్లి ప్రతినిధి, జూలై -05 అక్షరం న్యూస్; వయో వృద్ధుల సంరక్షణ చట్టం పరిధిలోని ఒక కేసు విచారించిన *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 30 రోజులలో కొడుకు ఇళ్ళు ఖాళీ చేయాలని తీర్పును వెల్లడించారు. *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వయో వృద్ధులు సంరక్షణ చట్టం పరిధిలోని కేసు విచారించారు. రామగుండం మండలములోని ఎఫ్.సి.ఐ ప్రాంతానికి చెందిన ఒక వృద్దురాలు తన కుమారుడు తన సంక్షేమం, పోషణ చూసుకోవడం లేదని తనని మానసికంగా వేదిస్తూ భయ బ్రాంతులకు గురిచే స్తున్నాడని, అంతే కాకుండా శ్రీయుత రెవెన్యూ డివిజినల్ అధికారి, పెద్దపల్లి తన కుమారుడిని ఇంటి నుండి ఖాళీ చేయుటకు ఇచ్చినటువంటి ఉత్తర్వులు అమలు జరుగలేదని తెలుపుతూ తన భర్త నిర్మించిన ఇంటి నందు తన మిగిలిన శేష జీవితాన్ని అందులో ప్రశాంతంగా గడపాలని తన కుమారుడిని ఇంటి నుండి ఖాళీ చేపించి తనకు న్యాయం చేయమని కోరుతూ శ్రీయుత జిల్లా కలెక్టర్, పెద్దపల్లి గారికి తల్లిదండ్రులు,వయోవృద్దుల పోషణ మరియు సంరక్షణ చట్టం, 2007 క్రింద దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష,* దరఖాస్తును పరిశీలించి తల్లిదండ్రులు,వయో వృద్దుల పోషణ , సంరక్షణ చట్టం, 2007 క్రింద అప్పీలు గా నమోదు చేసి ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసి విచారణ జరుపగా అర్జీదారు కుమారుడు అర్జీదారు యొక్క పోషణ, సంక్షేమం సరిగా చూసుకోవడం లేదని అందువల్ల అర్జీదారు మానసికంగా వేదనకు గురిఅవుతున్నాడని తెలిసింది. ఈ విషయములో అర్జీదారు యొక్క కుమారుడికి ఇంటి నుండి ఎందుకు ఖాళీ చేయకూడదో తెలుపుటకు నోటీసులు జారీ చేయగా అర్జీదారు కుమారుడు అట్టి ఇల్లు వారసత్వ సంపద అని అందులో తనకు వాటా కలదని తెలిపినారు. ఈ అంశంలో పూర్తి విచారణ జరిపి తల్లిదండ్రులు, వయో వృద్దుల పోషణ సంరక్షణ చట్టం, 2007 లోని సెక్షన్ (23) , 21(3)(b) నియమం క్రమం అర్జీదారు యొక్క భద్రత, శ్రేయస్సు గౌరవాన్ని పరిగణనలోకి తీసుకొని అర్జీదారు యొక్క కుమారుడిని (30) రోజులలో ఇంటిని ఖాళీ చేస్తూ ఇకపై అర్జీదారునకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయరాదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు . ఒకవేళ ఇట్టి ఆదేశాలను ఉల్లంఘించినచో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. ఇట్టి ఆదేశాల అమలు జరిగేలా చూడాలని జిల్లా సంక్షేమ అధికారి,పెద్దపల్లి , సంబందిత పోలీసు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడమైనది. జన్మనిచ్చిన తల్లితండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన భాద్యత వారి సంతానం పై ఉంటుందని, వారిని నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలు గైకోనబడునని కలెక్టర్ తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :