Tuesday, 31 March 2026 03:06:13 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మా పిల్లలకు దేవుళ్లలా వచ్చారు సహస్ర ఫౌండేషన్ సేవకు కన్నీటి కృతజ్ఞత* *కోట్ల రూపాయల చికిత్స… నిరాశలో ఉన్న కుటుంబానికి ఆశగా సహస్ర ఫౌండేషన్*

*మీరు ఒంటరిగా లేరు అంటూ ముందుకొచ్చిన సహస్ర ఫౌండేషన్* *దాతల సహకారంతో రూ.70,000 తల్లిదండ్రులకు అందజేత* *దాతల పెద్ద మనసుకు సహస్ర ఫౌండేషన్ కృతజ్ఞతలు*


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 29 March 2026 07:53 PM Views : 31

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా : * వరంగల్ అక్షరం ప్రతినిధి ప్రతి రోజూ వార్తల్లో సమస్యలు కనిపిస్తాయి… కానీ అరుదుగా మాత్రమే మనసును కదిలించే మానవత్వం కనిపిస్తుంది. అలాంటి మానవత్వానికి చిరునామాగా నిలుస్తోంది సహస్ర ఫౌండేషన్.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహస్ర(7), మహావీర్(4)… స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధితో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఈ చికిత్స… ఆ కుటుంబానికి అసాధ్యంగా మారింది.వాళ్లు ఒంటరిగా లేరు… మేమున్నాం” అని ముందుకొచ్చింది సహస్ర ఫౌండేషన్.సంస్థ ఫౌండర్ పాత్తేపు ప్రవీణ్ ఆధ్వర్యంలో… దాతల సహకారంతో రూ.70,000 సాయం సమీకరించి… ఆదివారం వరంగల్ చౌరస్తాలోని డాజిల్ స్పోర్ట్స్ వేర్‌లో చిన్నారుల సమక్షంలో తల్లిదండ్రులకు అందజేశారు.ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు కన్నీటి కళ్లతో స్పందిస్తూ…మా పిల్లలకు దేవుళ్లలా వచ్చారు… మా పరిస్థితిలో మీరు చేసిన ఈ సహాయం మాకు కొత్త ఆశ ఇచ్చింది” అని భావోద్వేగానికి లోనయ్యారు.సహస్ర ఫౌండేషన్ సభ్యులు చూపిన చొరవ… అక్కడున్న ప్రతి ఒక్కరి మనసును కదిలించింది.వారి మాటల్లో వ్యక్తమైన ఆ కృతజ్ఞత… సహస్ర ఫౌండేషన్ చేసిన సేవ ఎంత గొప్పదో తెలియజేస్తూ మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తూ… సహస్ర ఫౌండేషన్ మరోసారి సేవాస్ఫూర్తిని చాటుకుంది.ఈ సందర్బంగా సహస్ర ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. మేము కేవలం ఒక వేదిక మాత్రమే ఈ సహాయం మొత్తం దాతల పెద్ద మనసు వల్లే సాధ్యమైంది ఒక్కో రూపాయి వెనుక ఒక హృదయం ఉంది ఆ హృదయాలే ఈ రోజు ఈ చిన్నారులకు ఆశగా నిలిచాయి సహస్ర ఫౌండేషన్ పేరు ముందు ఉన్నా నిజమైన హీరోలు మా దాతలే అని దాతలు చూపిన స్పందనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సహస్ర ఫౌండేషన్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :