AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ మురుకులపల్లి /ఆగస్టు 28 /అక్షరం న్యూస్: అన్నాచెల్లెళ్ల అప్యాయతకు పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు ములకలపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అత్యంత వైభవంగా కోలాహలంగా జరుపుకున్నారు. మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొనగా అక్కాచెల్లెళ్లు తమ సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రేమతో రాఖీలు కట్టారు. ఉదయం నుంచే ఇళ్లల్లో సందడి నెలకొంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు నూతన వస్త్రాలు ధరించి ముస్తాబయ్యారు. సోదరుల కుడి చేతి మణికట్టుపై రక్షా సూత్రాన్ని కట్టి నుదుటిన తిలకం దిద్ది మిఠాయిలు తినిపించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. సోదరులు తమ చెల్లెళ్లకు సదా అండగా ఉంటామని హామీ ఇచ్చి ప్రత్యేక కానుకలు బహుకరించారు. పండుగ నేపథ్యంలో ములకలపల్లి ప్రధాన రహదారి ఇరువైపులా కూడళ్లు రంగుల రాఖీలు షాపులతో, మిఠాయి దుకాణాలతో కిటకిటలాడాయి. వివిధ రకాల ఆకర్షణీయమైన డిజైన్ల రాఖీలను కొనుగోలు చేయడానికి మహిళలు యువతులు ఎగబడ్డారు. ఉత్సాహంగా రాఖీ వేడుకలు జరుపుకున్నారు. పండుగ ప్రశాంత వాతావరణంలో ముగిసింది.
.
Aksharam Telugu Daily