Saturday, 07 February 2026 06:20:04 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో 157 మంది

36 స్థానాల్లో కాంగ్రెస్, 35 స్థానంలో టిఆర్ఎస్ పోటీ .... 26 స్థానాల్లో బిజెపి 23 స్థానాల్లో ఏఐఎఫ్బి పోటీ


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 03 February 2026 09:43 PM Views : 254

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... పెద్దపల్లి, ప్రతినిధి ఫిబ్రవరి 3 అక్షరం న్యూస్, పెద్దపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయ వేడి పెరిగింది. ఫైనల్ అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో ఎన్నికల బరిలో మొత్తం 36 వార్డుల్లో కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో చివరగా 157 మంది అభ్యర్థులు నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుండగా, ఏఐఎఫ్‌బీ పార్టీ మధ్యలో బలమైన శక్తిగా ఎదిగి కీలక పాత్ర పోషించే స్థితిలో ఉంది. పార్టీ–వైజ్‌గా చూస్తే కాంగ్రెస్ 36 మంది, టీఆర్ఎస్ 35 మంది అభ్యర్థులతో దాదాపు సమాన బలంతో బరిలో ఉన్నాయి. బీజేపీ 26 మంది అభ్యర్థులతో మూడో శక్తిగా పోటీ చేస్తుండగా, ఏఐఎఫ్‌బీ 23 మంది అభ్యర్థులను నిలిపి పలు వార్డుల్లో గట్టి పోటీ ఇస్తోంది. జనసేన 6, ఏఐఎంఐఎం, సీపీఐ చెరో 3, బీఎస్పీ ఒకరు, ఇతర పార్టీలు 4 మంది అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఇక 20 మంది స్వతంత్ర అభ్యర్థులు ఫలితాలను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. వార్డు–వైజ్‌గా పోటీ స్థితిని పరిశీలిస్తే 1వ వార్డు–4, 2వ–7, 3వ–4, 4వ–5, 5వ–6, 6వ–5, 7వ–8, 8వ–5, 9వ–4, 10వ–5, 11వ–3, 12వ–3, 13వ–4, 14వ–4, 15వ–5, 16వ–3, 17వ–4, 18వ–3, 19వ–2, 20వ–4, 21వ–6, 22వ–3, 23వ–4, 24వ–4, 25వ–9, 26వ–6, 27వ–4, 28వ–2, 29వ–4, 30వ–4, 31వ–3, 32వ–5, 33వ–4, 34వ–5, 35వ–3, 36వ–3 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా 25వ వార్డులో 9 మంది, 7వ వార్డులో 8 మంది పోటీ చేస్తుండగా, 19వ, 28వ వార్డుల్లో కేవలం ఇద్దరేసి అభ్యర్థులతోనే పోటీ కొనసాగుతోంది. రాజకీయంగా పరిశీలిస్తే కాంగ్రెస్–టీఆర్ఎస్ మధ్య నేరుగా పోటీ కొనసాగుతున్నప్పటికీ, పలు వార్డుల్లో ఏఐఎఫ్‌బీ ప్రభావం ఫలితాలను తారుమారు చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :