D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/బూర్గంపహాడ్ మండలం/ మొరంపల్లి బంజర. అక్షరం న్యూస్/ జూలై 31: ఐ టి సి మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నాడు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను మొరంపల్లి బంజర పీహెచ్సీ నందు సుమారు 15 కిట్లు మరియు బూర్గంపాడు సిహెచ్సి నందు సుమారు 15 కిట్లను అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని పుట్టే పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదని వారికి పది రకాల పౌష్టికాహారాన్ని అందజేశామని, గర్భిణీ స్త్రీలకు పోషకాహార లోప సమస్యలు ఉండకూడదని పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, వారి ఆరోగ్యం మరియు పుట్టబోయే పిల్లల ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు డాక్టర్ల సలహా మేరకు పాటించాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఐ టి సి సీనియర్ మేనేజర్స్ చెంగల్ రావు, చాంద్ పాషా, డిపి రాయ్ , హాస్పిటల్ డాక్టర్స్ కే శ్రావణి గైనకాలజిస్ట్, డాక్టర్ తిరుపతి డెంటిస్ట్ మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily