AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 12/ అక్షరం న్యూస్/----వనవాసి కళ్యాణ పరిషత్ గిరిజన విద్యార్థుల కోసం గ్రామాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలను ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కొరకు పాటు పడుతుంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుపుతున్న ఆచార్యులకు వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయం నందు రెండు రోజుల ప్రశిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు రాష్ట్ర జిల్లాస్థాయి ప్రముఖులు విచ్చేసి ఏకోపాధ్యాయ ఆచార్యులు విద్యార్థులకు ఎలా బోధించాలి అనే అంశాలపై ఆచార్యులకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశా లత సామాన్య జ్ఞానం సంస్కార జ్ఞానం అంశాలపై ఆచార్యులకు శిక్షణ ఇచ్చారు. తదుపరి విద్యా విభాగ్ ప్రముఖ్ సున్నం రాజేష్ ఈ మాసంలో విద్యార్థులకు ఆటపాటల ద్వారా ఏ ఏ అంశాలను ఎలా బోధించాలో వివరించారు. జిల్లా సంఘటనా మంత్రి కొరం రామారావు రికార్డ్స్ రాసే విధానం మరియు ప్రతినెల మండల జిల్లా ప్రఖండలు వారి వారి పర్యటన వివరాలను నెల ఆఖరి లోపు తెలియాలని అన్నారు. ఆచార్యుల ప్రశిక్షణా తరగతులకు చర్ల మండలం నుంచి ఐదుగురు ఆచార్యులు వెంకటాపురం నుండి ఒక్కరు దుమ్ముగూడెం మండలం నుంచి అయిదుగురు మరియు ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily