Wednesday, 04 March 2026 01:46:12 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

134వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు..

హక్కుల ప్రధాత, కుల నిర్మూలన ప్రబోధ యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో నడవాలి" – *కలెక్టర్ జితేష్.వి.పాటిల్*.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 14 April 2025 05:56 PM Views : 761

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : " భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / ఏప్రిల్ 14 / అక్షరం న్యూస్ -: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ లో బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. జయంతివేడుకలకు మారపాక రమేష్ కన్వీనర్ గా వ్యవహరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ పాల్గొని మాట్లాడుతూ – "బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు లేని సమాజంలో హక్కులు కల్పించిన మహాత్ముడు అని ఆయన దారి అనుసరించాలంటే బిడ్డల చదువు కోసం పోరాడాలి. మనందరం సమానత్వంతో, గౌరవంగా బ్రతకడానికి ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. ప్రతి పౌరుడు ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలి,"అని పేర్కొన్నారు. ఇక కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్‌పి రోహిత్ రాజ్ మాట్లాడుతూ – "బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నిజమైన మార్గదర్శకాలు అని ఆయన కోసం మాట్లాడాలంటే విద్య కోసం మాట్లాడాలి. అంబేద్కర్ ఆలోచనలు, మాటలు నాకు దారి చూపాయి అని నేడు నేను ఈ పదవిలో ఉండగలిగిన దానికి కారణం ఆయన చూపిన మార్గమే" అని పేర్కొన్నారు. అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బావితరాలకు మార్గదర్శకుడైన అంబేద్కర్ ఆశయాల సాధనకోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని, ఆయన ఆశయాలకు అనుగుణగా కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ విద్యా చందన, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య,అంబేద్కర్ జయంతి కన్వీనర్ *మారపాక రమేష్ కుమార్, జే.బీ.శౌరి, మద్దెల శివకుమార్, కూసపాటి శ్రీనివాస్, న్యాయవాది యెర్రా కామేష్, మంద హనుమంతు* తదితరులు పాల్గొన్నారు..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :